మూర్తిత్రయం ( భగవాన్ శ్రీరామకృష్ణులు, శ్రీ శారదాదేవి, స్వామి వివేకానందల సంక్షిప్త జీవిత గాథలు )
పాశ్చాత్య సంస్కృతుల నడుమ మనిషి భోగాలనే పరమార్థాలని విశ్వసిస్తూ జీవిస్తున్నందున, వారిని ఆధ్యాత్మికతవైపుకి మళ్ళించేందుకే శ్రీరామకృష్ణులు అవతరించారు. మత విద్వేషాలతో రగులుతున్న ప్రజల ఆర్తిని ఉపశమింపచేసేందుకు తన స్వీయ అనుభూతి ద్వారా ‘మతాలెన్నో మార్గాలు అన్ని’ అని బోధించిన మహాప్రవక్త శ్రీరామకృష్ణులు. భారతీయ స్త్రీత్వపు ఆదర్శ పరిపూర్ణతే శ్రీ శారదాదేవి. నూతనత్వ దిశలో పరుగిడుతున్న కాలానికి భారతీయ స్త్రీత్వపు ఆదర్శాన్ని చాటి చెప్పేందుకు శ్రీ శారదామాత అవతరించారు. భారతీయులలోని, ముఖ్యంగా యువతలోని ఆత్మన్యూనతా భావాన్ని పారద్రోలే విధంగా ప్రబోధం గావించిన యోగి, దార్శనికుడు స్వామి వివేకానంద. సమయాభావం వల్ల పెద్ద పెద్ద పుస్తకాలు చదువలేని పాఠకుల ప్రయోజనార్థం ఈ మూర్తిత్రయం యొక్క సంక్షిప్త జీవిత చరిత్రలను చిన్న పుస్తకంగా రూపొందించి అందిస్తున్నాము.
Murtitrayam
Weight 90 g Book Author Ramakrishna Math Hyderabad
Pages 104
Binding Paperback
Publisher Ramakrishna Math, Hyderabad
ISBN-13 / Barcode 978-93-83972-82-1